News January 26, 2026
మదర్ డెయిరీలో ముదిరిన సంక్షోభం

నల్గొండ జిల్లాలోని మదర్ డెయిరీలో పాలకవర్గ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు పరాకాష్టకు చేరుకున్నాయి. 15 రోజుల్లోనే ఇద్దరు ఛైర్మన్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలతో మందడి ప్రభాకర్ రెడ్డి తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డెయిరీకి ఉన్న ₹28 కోట్ల అప్పు విషయంలో బ్యాంకులు సీరియస్ అయ్యాయి. ఫిబ్రవరి 1 లోగా ₹10 కోట్లు చెల్లించకుంటే డెయిరీని సీజ్ చేస్తామని హెచ్చరించాయి.
Similar News
News February 20, 2026
NLG: ఎన్నికల ఖర్చులో చేతివాటం!

జిల్లాలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఇప్పుడు ఖర్చుల లెక్కలపై చర్చ మొదలైంది. ఎన్నికల నిర్వహణ పేరుతో అయ్యే వ్యయంపై సరైన ఆడిట్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఎన్నికల ఖర్చులను భారీగా పెంచి చూపి, వ్యక్తిగత లాభం పొందిన ఘటనలున్నాయి. ఎన్నికల ఖర్చులపై ఆడిట్ లేకపోవడంతో రూ.లక్షల్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News February 20, 2026
నల్గొండ: మున్సిపాలిటీల్లో ‘కోఆప్షన్’ కోలాహలం

జిల్లాలోని మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గాల ఏర్పాటు ప్రక్రియ ముగియడంతో, రాజకీయ సమీకరణాలు ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల భర్తీ చుట్టూ తిరుగుతున్నాయి. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ పదవులను దక్కించుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, పార్టీ కోసం కష్టపడిన వారు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.
News February 20, 2026
నల్గొండ: ప్రభుత్వ బడి విద్యార్థులకు ‘రవాణా’ భరోసా

మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే విద్యార్థుల కోసం ఉద్దేశించిన రవాణా భత్యం నిధులను రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం తాజాగా విడుదల చేసింది. జిల్లాలో అర్హులైన ప్రతి విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి మార్చి వరకు నిధులను విడుదల చేసింది


