News September 10, 2025
మద్దతు ధర రూ.10 కోట్లు మంజూరు: కలెక్టర్

అర్లీ ఖరీఫ్లో పండించిన ఉల్లి రైతులకు రూ.1,200 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం ఉల్లి కొనుగోళ్ల అంశానికి సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కొనుగోళ్ల కమిటీ సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రైతుల నుంచి ఆధార్, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News September 10, 2025
కర్నూలులో హత్య.. మరో ఇద్దరి అరెస్ట్

కర్నూలు 1 టౌన్ పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పార్థసారథి వివరాల మేరకు.. నిందితులు షేక్ ఇమ్రాన్(37), షేక్ యూసుఫ్(22)ను రాఘవేంద్ర ఘాట్ వద్ద పట్టుకొని, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్టయ్యారు. మొత్తం ఐదుగురు కలిసి షేక్ ఇజహర్ అహ్మద్పై దాడి చేసి, హత్య చేసినట్లు వెల్లడైంది.
News September 9, 2025
స్కూల్ గేమ్స్ అండర్ 19 షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 19 బాల బాలికల ఎంపిక పోటీల షెడ్యూల్ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాఘవేంద్ర సోమవారం విడుదల చేశారు. DSA అవుట్ డోర్ స్టేడియంలో 10వ తేదీ ఆర్చరీ, ఘాట్కా, సెపక్ తక్ర 11న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫుట్ బాల్, DSAలో 12న ఫెన్సింగ్, కురాశ్ , ఉషూ 13న సైక్లింగ్, కరాటే, మాల్కంబ్తోపాటు మరికొన్ని అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News September 9, 2025
కర్నూలులో హత్య కేసును ఛేదించిన పోలీసులు

కర్నూలులో జరిగిన షేక్ ఇజహర్ అహ్మద్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు DSP బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి 3 కత్తులు, స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత గొడవల కారణంగా ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్, ఎస్ఎండీ ఇర్ఫాజ్, యూసుఫ్ కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్ను అరెస్టు చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.