News January 17, 2026

మద్దిలపాలెంలో బస్సు కింద పడి వ్యక్తి మృతి

image

విశాఖలోని మద్దిలపాలెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, స్కూటీ ఒకే దిశలో వెళ్తుండగా, స్కూటీ అదుపుతప్పి పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు.

Similar News

News February 19, 2026

ఖమ్మం: భోజనం చేస్తూ వ్యక్తి గుండెపోటుతో మృతి

image

కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన శ్రీను (38) మణుగూరులోని బంధువుల ఇంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను ఆకస్మిక మరణంతో దుబ్బతండా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

News February 19, 2026

సన్నబియ్యం పంపిణీలో పోర్టబిలిటీ తిప్పలు

image

ఖమ్మం జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారులు, డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టబిలిటీ సౌకర్యం కారణంగా ఇతర ప్రాంతాల వారు రావడంతో స్థానిక కార్డుదారులకు బియ్యం అందక డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. అక్రమాలను అరికట్టేందుకే ‘స్లాబ్’ విధానం అమలు చేస్తున్నామని అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇండెంట్ ప్రకారమే బియ్యం కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

News February 19, 2026

ఉదయాన్నే టిఫిన్ చేయాల్సిందేనా?

image

బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కేవలం బరువుపైనే కాదు.. ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేవారికి గుండె జబ్బుల ముప్పు 27%, టైప్-2 డయాబెటిస్ రిస్క్ పురుషుల్లో 21%, మహిళల్లో 20% పెరుగుతోంది. ఉదయం టిఫిన్ చేయకపోతే శరీరంలో గ్లూకోజ్, లిపిడ్ కంట్రోల్ తప్పడమే కాకుండా ఇన్సులిన్ లెవెల్స్ అస్తవ్యస్తమవుతాయని తేలింది. బ్రెయిన్ ఫంక్షన్ కూడా దెబ్బతింటున్నట్లు తెలిసింది.