News May 13, 2024

‘మద్నూర్‌‌లో ఉ.8 గంటల వరకు ఓట్లు నమోదు కాలేదు’

image

మద్నూర్ మండలంలోని మూడో వార్డులో ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం 8 గంటల వరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని అధికారుల తెలిపారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో టెక్నీషియన్ల సాయంతో వాటిని బాగు చేయించి ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు.

Similar News

News September 12, 2025

NZB: యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం: మంత్రి

image

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం NZBరూరల్ MLAక్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రానికి సరిపడినంత యూరియా పంపకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. స్టాక్ పంపాలని విన్నపాలు చేసినప్పటికీ అడపాదడపా యూరియా పంపుతూ ఇక్కడి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు.

News September 12, 2025

సాయంత్రం 4 గంటలకు శ్రీరాంసాగర్ గేట్లు ఓపెన్

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వస్తున్న వరద ప్రవాహాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఏ సమయంలోనైనా స్పిల్‌వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీశ్ తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పశువుల కాపరులు, మత్స్యకారులు, రైతులు నదిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

News September 12, 2025

KMR: యువకుడి మోసం.. యువతి ఆత్మహత్య

image

ప్రేమలో మోసపోయానని మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్‌లో బుధవారం జరిగింది. ఎస్సై బొజ్జ మహేష్ వివరాలు.. గ్రామానికి చెందిన సావిత్రి(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన ప్రదీప్ ప్రేమ పేరుతో మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.