News March 29, 2024
మద్నూర్లో ఘరానా దొంగ అరెస్ట్

మండలంలో జరిగిన <<12933675>>భారీ చోరీ<<>> కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రూ.13.50 లక్షల నగదును రికవరీ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మద్నూర్ మండలంలో నివాసం ఉండే మహాజన్ బాలాజీ ఇంట్లో ఈ నెల 26న రాత్రి చోరీ జరిగింది. బీరువాలో దాచిన 25 తులాల బంగారం, నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
NZB: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో నిజామాబాద్లోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్కు మే 11 చివరి తేదీ. వెబ్సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281
News April 21, 2025
NZB: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో NZBలో నిరుద్యోగులు ప్రిపరేషన్కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
News April 21, 2025
ఎడపల్లి: దారుణం.. మరదలిని చంపేసింది..!

అరెకరం భూమి, పెన్షన్ డబ్బుల కోసం సొంత మరదలిని వదిన హత్య చేసిన ఘటన NZB జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్లో వెలుగు చూసింది. ఈ ఘటన ఈ నెల3న చోటు చేసుకోగా పోలీసుల విచారణలో సొంత వదిన అనసూయ, మరో వ్యక్తి రాకేశ్ హత్యకు పాల్పడినట్లు తేలింది. పురుమెటి లక్ష్మీ మానసిక దివ్యాంగురాలు తన తల్లిదండ్రులు ఇచ్చిన అరెకరం తన పేరుమీద పట్టా చేయమనడంతో వదిన ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు.