News October 10, 2025
మద్నూర్: తిట్టాడని కట్టెలతో కొట్టి చంపారు: DSP

డబ్బుల విషయంలో జరిగిన హత్య కేసులో 8మందిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ DSP విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మద్నూర్ మండలం సోమూరులో SEP 28న డబ్బులు బాకీ విషయంలో రాజ్కుమార్ తిట్టడంతో, ఆగ్రహించిన 8మంది అతన్ని తీవ్రంగా కొట్టారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు DSP వెల్లడించారు. CI రవికుమార్, SI విజయ్ కొండ ఉన్నారు.
Similar News
News October 11, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 11, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.19 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 11, 2025
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.
News October 11, 2025
త్వరలో నెల్లూరులో అధునాతన కూరగాయల మార్కెట్

నెల్లూరులో అధునాతన వసతులతో అతిపెద్ద కూరగాయల మార్కెట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ నుంచి జీవో విడుదలైంది. నవాబుపేట సమీపంలోని నరుకూరు రోడ్డులో ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డులో నెల్లూరు నగరపాలక సంస్థ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ మార్కెట్ను పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. మొత్తం 19.69 ఎకరాలలో మార్కెట్ ఏర్పాటు కానుంది.