News March 21, 2024
మద్యం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710946079156-normal-WIFI.webp)
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మద్యం గోడౌన్, తయారీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ తనిఖీ చేశారు. బుధవారం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దేవరపాలెం వద్ద గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.
Similar News
News July 8, 2024
నారా లోకేశ్తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720426605522-normal-WIFI.webp)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కోటంరెడ్డిని నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలను కోటంరెడ్డి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
News July 8, 2024
వైఎస్ఆర్తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కాటంరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720417858187-normal-WIFI.webp)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆయనతో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వైఎస్సార్తో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవే మా ఘన నివాళులంటూ ఆయన పేర్కొన్నారు.
News July 8, 2024
నెల్లూరు: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720405597046-normal-WIFI.webp)
రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు మృతుడి వయసు సుమారు 55 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.