News March 15, 2025

మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి సూసైడ్

image

మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని చిన్న రామయ్య(30) ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొలిమిగుండ్ల మండలం బెలుంలో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్నరామయ్య ప్రతిరోజూ మద్యం తాగేవాడు. శుక్రవారం మద్యానికి భార్య శోభను డబ్బులు అడగగా.. ఆమె ఇవ్వలేదు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News March 15, 2025

నేడు తణుకులో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్‌’లో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉ.7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 8.05కు తణుకు చేరుకుంటారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పార్టీ శ్రేణులు, అధికారులతో సమావేశమై 12.55 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

News March 15, 2025

స్టాలిన్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

image

త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న స్టాలిన్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఈడీ సోదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంపై విమర్శలకు దిగిందని అన్నారు. బడ్జెట్ పత్రాల్లో రూపీ(₹) చిహ్నం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ సంస్థలను ఉల్లంఘించడమేనని ఫైరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారన్నారు.

News March 15, 2025

బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల ప్రవేశానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు ఉండగా, ఫీజు రూ.150 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బోనఫైడ్, ఆధార్, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఫొటో, సంతకం, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.

error: Content is protected !!