News June 15, 2024
మద్యం మత్తులో జ్వరం టాబ్లెట్లు వేసుకొని వ్యక్తి మృతి

మద్యం తాగిన మైకంలో అధిక మొత్తంలో జ్వరం టాబ్లెట్లు మింగి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం బొంరాస్ పేట మండలం మెట్లకుంట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేష్(32) తాగిన మైకంలో అధిక మొత్తంలో జ్వరం టాబ్లెట్లు వేసుకోవడం వల్ల చనిపోయాడు. ఈ మేరకు తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 16, 2026
పాలమూరు: నేడు ‘ప్రజావాణి’ రద్దు.. కారణం ఇదే!

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో నేడు జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి ప్రకటించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక అనంతరం తిరిగి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.
News February 16, 2026
పాలమూరు మేయర్ పీఠానికి ఫుల్ డిమాండ్!

పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న, పార్టీ సీనియర్ నేత సిరాజ్ ఖాద్రి సతీమణి హజీరాబేగం, ఏకగ్రీవంగా ఎంపికైన రమ శ్రీనివాసరాజు మేయర్ పీఠానికి పోటీపడుతున్నారు. మేయర్ ఎంపిక విషయంలో నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదే అయినప్పటికీని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
News February 15, 2026
మన్యంకొండలో శేష వాహన సేవ

మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి శేష వాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గర్భాలయం నుంచి దక్షిణ కట్ట వరకు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, అలహరి రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.


