News April 15, 2024

మధుయాష్కి గౌడ్‌కు మాతృవియోగం

image

టీపీసీసీ ప్రచారకమిటీ ఛైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ (86) కన్నుమూశారు. వయసుసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని మధ్యాహ్నం ఓల్డ్ హయత్ నగర్లోని మధుయాష్కి స్వగృహానికి తీసుకురానున్నారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 30, 2024

నిజామాబాద్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
కామారెడ్డి 3560 272 1:13
నిజామాబాద్ 3204 285 1:11

News September 30, 2024

రేపు కామారెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

image

కామారెడ్డి: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. స్థానిక కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం పట్టణంలోని తిలక్ రోడ్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నా తర్వత రాజారెడ్డి గార్డెన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు.

News September 30, 2024

NZB: మంత్రి జూపల్లి రాక

image

మంత్రి జూపల్లి ఇవాళ జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు మోర్తాడ్, 11 గంటలకు భీంగల్, ఆ తర్వాత ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ భవనాలను ప్రారంభిస్తారని అధికారులు, నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్‌లోని IDOC సమీక్షా సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.