News August 4, 2024

‘మధురవాడ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి’

image

మధురవాడ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విశాఖలో మంత్రితో గంటా భేటీ అయ్యారు. భీమిలిలో ప్రధాన రహదారులను విస్తరించాలని కోరారు. భీమిలి, పీఎం పాలెం, కొమ్మాదిలో ఫ్లై ఓవర్ వంతెనలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. భీమిలి తగరపువలసలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News July 9, 2025

ద్వారకానగర్: పిల్లలకు సెలవు.. పేరెంట్స్‌ వెళితే గేట్లకు సీల్

image

ద్వారకానగర్‌లోని రవీంద్ర భారతీ స్కూల్ 3 రోజులుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా అసలు నిజం బయటపడింది. సిబ్బందికి ESI కల్పించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకపోవడంతో స్కూల్‌కు సీల్ వేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మేనేజ్‌మెంట్ పిల్లలకు సెలవు ప్రకటించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న DEO ప్రేమ్ కుమార్ ESI అధికారులతో మాట్లాడారు.

News July 9, 2025

సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

image

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.

News July 9, 2025

‘అప్పుఘర్ వద్ద సిద్ధంగా గజఈతగాళ్ళు’

image

అప్పుఘర్ వద్ద గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నేడు జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అజిత జువేరి, లక్ష్మీనారాయణ పరిశీలించారు. అప్పుఘర్‌లో గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీలు ఏసీపీ నర్సింహామూర్తికి పలు సూచనలు చేశారు. విద్యుత్ వెలుగులతో పాటు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.