News August 14, 2025

మధ్యప్రదేశ్‌లో యాక్సిడెంట్.. బెల్లంపల్లిలో విషాదం

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన వ్యాపారి మహేందర్ చౌదరి కుమారుడు అరవింద్ చౌదరి(10)విద్యార్థి మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. స్వగ్రామమైన రాజస్థాన్‌కు కారులో వెళుతుండగా MPలో వెనుక నుంచి అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో అరవింద్ అక్కడికక్కడే మరణించగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News August 14, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ భద్రాద్రి జిల్లా పంచాయతీ కార్యదర్శికి ఎర్రకోట ఆహ్వానం
✓ భద్రాద్రి: లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు
✓ ఈనెల 21న చండ్రుగొండకు సీఎం రాక
✓ గురుకులాల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్: ఐటీడీఏ పీవో
✓ చెరువులా మారిన పాల్వంచ బస్టాండ్
✓ మొక్కల రాజశేఖర్‌కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం
✓ పాల్వంచలో యువకుడిపై దాడి
✓ భద్రాచలం-ఎటపాక-చర్ల రహదారి ఆగమాగం
✓ జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ.

News August 14, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

image

నందమూరులోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడారు. డిజిటల్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఫేక్ లింకులు, సోషల్ మీడియా దుర్వినియోగం, డిజిటల్ అరెస్ట్ మోసాల గురించి వివరించారు.

News August 14, 2025

బెల్లంపల్లి: మూసివేసిన గనిలో చోరీకి యత్నం

image

బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని మూసివేసిన గోలేటి-1A గనిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించినట్లు ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ చెప్పారు. సెక్యూరిటీ గార్డ్ గనిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించి గార్డును చూసి పారిపోయారన్నారు. సమాచారం అందుకున్న MTF టీం సోదా చేయగా 3 ద్విచక్ర వాహనాలు లభించాయన్నారు. వాహనాలను GM ఆఫీసులో భద్రపరిచామన్నారు.