News September 6, 2025

మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు: ఎస్పీ విక్రాంత్ పాటిల్

image

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే వస్తాయని, మధ్యవర్తుల ద్వారా రావని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో యువత జాగ్రత్త వహించాలని తెలిపారు.

Similar News

News September 6, 2025

నిబద్ధతతో పనిచేస్తేనే మనుగడ: సిరిసిల్ల కలెక్టర్

image

నిబద్ధతో పనిచేస్తేనే వ్యవస్థ మనగడ సాధ్యమవుతుందని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో గ్రామ పాలన అధికారులకు శనివారం నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించిందని జీపీఓలు క్షేత్రస్థాయిలో ప్రజలను నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలన్నారు.

News September 6, 2025

చంద్ర గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు

image

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేయడం జరిగిందనీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

News September 6, 2025

28న BCCI మీటింగ్.. ప్రెసిడెంట్ ఎన్నికపై చర్చ!

image

రోజర్ బిన్నీ రాజీనామాతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో అధ్యక్ష ఎన్నికపై చర్చించేందుకు ఈనెల 28న బోర్డు సమావేశం కానుంది. అలాగే మిగతా పోస్టుల భర్తీపైనా చర్చించనుంది. అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడతారనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా అదేరోజు దుబాయ్‌లో ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. దీంతో భారత్ ఫైనల్‌కు వెళ్తే BCCI నుంచి ఎవరూ హాజరుకాకపోవచ్చు.