News November 11, 2025
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఎంతంటే?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ మాత్రమే నమోదైంది. చాలామంది ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఏ అభ్యర్థీ నచ్చకపోతే నోటాకు కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
Similar News
News November 11, 2025
హార్ట్ బ్రేకింగ్.. బాంబ్ బ్లాస్ట్తో కుటుంబం రోడ్డుపైకి!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో మరణించినవారిలో కుటుంబానికి ఏకైక ఆధారమైన అశోక్ కూడా ఉన్నారు. మొత్తం కుటుంబంలో 8 మంది ఆయన సంపాదన మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు కాగా.. అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి. తల్లితో పాటు అనారోగ్యంతో ఉన్న అన్నయ్య పోషణను కూడా అశోక్ చూసుకుంటున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది రావొద్దని ఆయన పగటిపూట కండక్టర్గా, రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు.
News November 11, 2025
ఏపీ వారికీ నేను మామనే: శివరాజ్సింగ్

AP: మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చెప్పారు. వాటర్షెడ్ పథకం కింద గుంటూరు(D) వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ‘దీనిద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు పశువులకు తాగునీరు లభిస్తుంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చెరువులను అభివృద్ధి చేస్తాం. మధ్యప్రదేశ్ ప్రజలు నన్ను మామ అంటారు. ఇకపై AP వారికీ మామనే’ అని వ్యాఖ్యానించారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై NIA అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.


