News December 23, 2025

మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలి: కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజాబాబు అధ్యక్షత నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం నూరు శాతం అమలుజరగడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నాణ్యత లోపాలు లేకుండా చూడాలన్నారు.

Similar News

News February 9, 2026

ప్రకాశం: ACB దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి

image

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే.పల్లిపాలెం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సంపత్ కుమార్ లంచం తీసుకుంటూ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. సోమవారం ఆయన రూ.55 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం సంపత్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు.

News February 9, 2026

మార్కాపురం: లోయలో పడిన కారు.. ఒకరి మృతి

image

మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. CSపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వివరాల ప్రకారం.. కురిచేడు మండలానికి చెందిన విష్ణు భార్గవ్(25) గత నెల 17న తిరుమలనాథ స్వామి తిరుణాల నిమిత్తం కోనపల్లికి కారులో వెళ్లాడు. తిరిగి వస్తుండగా CSపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డు లోయలో కారు పడిపోయింది. ఇవాళ ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 9, 2026

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. 40లక్షల లడ్డూలు

image

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.