News November 1, 2025

మనకోసం మొదట దీక్ష చేశారు.. కానీ మనమే మరిచాం.!

image

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబర్ 1న 1956 జరుపుకుంటాం. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములును ఈ రాష్ట్రం ఎప్పటికీ మరవదు. అయితే ఆయన కన్నా ముందు 1952లో స్వామి సీతారాం(గొల్లపూడి సీతారామశాస్త్రి) గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్వామి సీతారాం దీక్ష 35 రోజుల తర్వాత విరమించగా, పొట్టి శ్రీరాములు 56 రోజుల దీక్ష తర్వాత మరణించి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమయ్యారు.

Similar News

News November 1, 2025

సూర్యరశ్మి వల్ల ఇన్ని లాభాలా..!

image

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సూర్యరశ్మి(ఉదయం/సాయంత్రం)లో ఉండటం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి విటమిన్-Dని అందిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సెరోటోనిన్‌ను విడుదల చేసి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఉదయం సూర్యకాంతి నిద్ర నాణ్యతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది’ అని సూచిస్తున్నారు. SHARE IT

News November 1, 2025

ఫ్రీ Ai.. బ్యాగ్రౌండ్ రీజన్స్ ఏంటంటే..?

image

మొన్న Grok Aiని మస్క్, నిన్న perplexity Aiని ఎయిర్‌టెల్, తాజాగా గూగుల్ Gemini Aiని ఫ్రీగా ఇస్తున్నట్లు జియో ప్రకటించాయి. ఎందుకు ఈ ఫ్రీ పోటీ అంటే.. మార్కెట్లో డామినెంట్, డాన్ అయితేనే యాడ్స్ వస్తాయిగా. సో.. మార్కెట్ వాటా పొందడం రీజన్1. R2: యూజర్స్ సెర్చ్ డేటా, బిహేవియర్ అర్థం చేసుకోవడం. R3: ప్రస్తుతం తొలి స్టేజ్‌లోని Ai బ్రౌజింగ్ యూజర్స్ ఇన్‌పుట్స్‌తో స్కిల్స్, సర్వీస్ తదితరాలు ఇంప్రూవ్ చేసుకోవడం.

News November 1, 2025

నమ్మకం, ఆత్మస్థైర్యమే బిర్సా ముండా ఆయుధాలు: కలెక్టర్

image

బిర్సా ముండా జయంతి సందర్భంగా గుంటూరులోని గిరిజన సంక్షేమ కళాశాల ప్రాంగణంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ‘జాతీయ గౌరవ దివాస్’ నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా ఆయుధాలను కాకుండా నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఆయుధాలుగా చేసుకున్నారని ఆమె కొనియాడారు. ప్రజలు బిర్సా ముండాను ప్రేమతో ‘ధర్తీ ఆభా’ అని పిలిచేవారని చెప్పారు.