News February 6, 2026
‘మనమిత్ర’ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: ఎస్పీ

ప్రజలకు పోలీసు సేవలను మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ మనమిత్ర సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతికతను జోడించి పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.
Similar News
News February 16, 2026
ఎల్.ఎన్.పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోటి వచ్చిన ఆనందం

ఎల్.ఎన్.పేట(M) కేంద్రంలో పెద్దకోట గ్రామానికి చెందిన కొంత మంది రైతులు మొక్కజొన్న పొత్తులను ప్రయాణికులకు అమ్ముతున్న దృశ్యం సోమవారం కనిపించింది. కాలానుగుణంగా ఉన్న పంటలను, ఇతర పదార్థాలను ఈ గ్రామం వద్ద బస్సులు ఆగినప్పుడు అమ్మి జీవనోపాధి సాగిస్తారు. బస్సు నడిస్తే పరుగుపెడుతూ..జొన్నపొత్తుల ద్వారా వచ్చే రూ.50లకు రోజంతా కష్టపడి జేబు నిండితే ఆనందంగా ఇంటి బాట పడతారు.
News February 16, 2026
ఆమదాలవలస: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంంతో జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాని చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతునికి 45 ఏళ్లు ఉంటాయని, గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ను ధరించినట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు స్థానిక జీఆర్పీ స్టేషన్ సంప్రదించాలన్నారు. దీనిపై కేసు నమోదైంది.
News February 16, 2026
ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలకు నేడే లాస్ట్..!

శ్రీకాకుళం జిల్లాలో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18-40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఉండదు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380,
ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000-24,470 వేతనం ఉంటుంది.


