News May 11, 2024

మనుబోలు ప్రమాదంలో ఇరువురు మృతి

image

జాతీయ రహదారిపై మనుబోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లకూరు మండలం చిల్లకూరుకు చెందిన వేణు, ఆకాష్ బైక్ పై నెల్లూరు నుంచి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. వేణు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆకాష్ నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 14, 2025

నెల్లూరు: KG మటన్ రూ.500.. బారులు తీరిన జనాలు

image

ఆఫర్స్ పెట్టీ కస్టమర్స్‌ని ఆకట్టుకోవడం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే నెల్లూరులోని బీవీ నగర్‌లో జరిగింది. ఓ మటన్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా కిలో మటన్ 500 రూపాయలే అని బోర్డ్ పెట్టడంతో చుట్టు పక్కల జనాలు అందరూ బారులు తీరారు. మార్కెట్‌లో 1000 రూపాయలకు దొరికే మటన్ రూ.500కి వస్తుండటంతో ఆ షాప్ వద్దకు జనాలు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతం కాస్త రద్దీగా మారింది.

News November 14, 2025

నెల్లూరు: 2 రోజుల పోలీస్ కస్టడీకి కిలాడి లేడీ డాన్ అరుణ

image

నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కిలాడి లేడీ డాన్ అరుణ రెండు రోజుల కస్టడీ నిమిత్తం గురువారం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై, అంగన్వాడి పోస్టులు ఇప్పిస్తామంటూ మోసగించినట్లు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీలో తీసుకుని విజయవాడకు తరలించారు.

News November 14, 2025

నెల్లూరు: సైలెంట్ కిల్లర్‌కు చెక్ పెట్టేది ఎలా.?

image

మధుమేహ వ్యాధి గురించి జిల్లా వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. NOV 14 తేదీని ‘వరల్డ్ డయాబెటిస్ డే’ గా పాటిస్తున్న సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 6 లక్షల మందికి పైగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. సైలెంట్ కిల్లర్ అని చెప్పుకునే మధుమేహానికి సరైన జీవనశైలితో చెక్ పెట్టొచ్చని అంటారు.