News January 31, 2025
మనూర్: ఎడ్ల బండి కింద పడి వ్యక్తి మృతి

మనూర్ మండలం బాదల్ గావ్ శివారులో ఎడ్ల బండి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మత్లి తండాకు చెందిన చౌహాన్(40) కుటుంబంతో కలిసి చెరుకు నరికే పనులకు వచ్చాడు. చెరకు తరలిస్తున్న క్రమంలో ప్రమాద వశాత్తు ఎడ్ల బండి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 27, 2025
NRPT జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా ప్రతీక్ జైన్

నారాయణపేట జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ నెల 17 నుంచి జనవరి 11 వరకు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో, ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 27, 2025
NRPT జిల్లా స్థాయి INSPIRE & సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ

జిల్లా స్థాయి INSPIRE ప్రదర్శన (2024–25)ను జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ (2025–26)తో కలిపి నిర్వహించనున్నారు. INSPIREలో జిల్లా స్థాయికి ఎంపికైన 19 ప్రాజెక్టులతో విద్యార్థులు పాల్గొననుండగా, ప్రతి విద్యార్థికి రూ.10,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనేలా హెడ్మాస్టర్లు, గైడ్ టీచర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి గోవిందు రాజులు తెలిపారు.
News December 27, 2025
మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్

TG: జనవరి 5 నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం బచావో కార్యక్రమం చేపట్టాలని CWC సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పలు ప్రయోజనాలతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు Xలో రాసుకొచ్చారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.


