News February 14, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో కొరియర్ బాయ్కి గాయాలు

మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజు (24) కొరియర్ బాయ్గా పని చేస్తున్నాడు. రాత్రి హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ రామాయపల్లి బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 23, 2025
రేపు మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన

రేపు మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చేగుంట మండల కేంద్రంలో గల రైతు వేదికలో మంత్రి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
News December 23, 2025
మెదక్: ‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.6.46 కోట్లు జమ’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 509 మంది లబ్ధిదారులకు వారం రోజుల్లోనే రూ.6.46 కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. 4,529 మంది లబ్ది దారులకు ఇప్పటికే సుమారుగా రూ.90 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. మెదక్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై హౌసింగ్ పీడీ మాట్లాడారు.
News December 23, 2025
కేసీఆర్ ప్రెస్మీట్తో డిఫెన్స్లోకి రేవంత్ సర్కార్: హరీశ్ రావు

తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రెస్మీట్తో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్లో పడిందన్నారు. పేదల సమస్యలు వదిలి షోలు, సమ్మిట్లతో కాలం గడుపుతోందని ఆరోపించారు. కో ఆపరేటివ్ ఎన్నికలు తప్పించుకుంటూ భయంతో పాలన సాగుతోందన్నారు.


