News April 7, 2025

మన్యంకొండలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..!

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. రాముడి కళ్యాణం అనంతరం ఈరోజు ఆనవాయితీ ప్రకారం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మంటపమైన లక్ష్మీ విలాసంలో శ్రీరాముడి పట్టాభిషేకానికి స్వామివారిని అలంకరించారు. శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకలతో మన్యంకొండ పులకించింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాములవారిని భక్తులు దర్శించుకున్నారు.  

Similar News

News July 9, 2025

భారత నేవీలో 1,040 పోస్టులు

image

భారత నేవీలోని పలు విభాగాల్లో 1,040 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, PH, మహిళలు మినహా మిగతావారికి రూ.295గా ఉంది. రాతపరీక్షతో పాటు పలు పోస్టులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. పూర్తి వివరాల PDF కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 9, 2025

నిర్మల్: ‘15 తేదీలోగా దరఖాస్తు చేసుకోండి’

image

జిల్లాలో పదో తరగతి చదువుతున్న దివ్యాంగుల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని డీఈవో రామారావు తెలిపారు. మార్చి 2026లో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని నింపి దివ్యాంగుల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతచేసి ఈనెల 15వ తేదీలోగా ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందించాలని సూచించారు.

News July 9, 2025

ఏలూరు: 14న 2,500 ఉద్యోగాలకు జాబ్ మేళా

image

వట్లూరులోని CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జులై 14న ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. సుమారు 2,500 ఉద్యోగ ఖాళీలకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హతలు ఉండాలన్నారు. వివరాలకు 8143549464 సంప్రదించాలి.