News February 27, 2025
మన్యంకొండ: భక్తులను ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి భక్తుల జాగరణను దృష్టిలో ఉంచుకొని కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఆద్యంతం మంత్రముగ్ధులను చేసి ఆకట్టుకున్నాయి.
Similar News
News April 22, 2025
MBNR: KCR సభ.. భారీగా జన సమీకరణకు నేతల ప్లాన్

వరంగల్లో ఈనెల 27న BRS రజతోత్సవ భారీ బహిరంగ సభకు MBNR, WNP, NGKL, NRPT, GDWL జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఒక్క ఉమ్మడి పాలమూరు నుంచే సభకు 2 లక్షల మందికి పైగా తరలించేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి సూచనలతో వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందరం KCRసభకు వెళ్దామని శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
News April 22, 2025
MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 42.1 డిగ్రీలు, నవాబుపేట 42.0 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్తమొల్గర 41.9 డిగ్రీలు, దేవరకద్ర 41.8 డిగ్రీలు, కౌకుంట్ల 41.5 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లి, మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News April 22, 2025
నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.