News August 14, 2025
మన్యం: చెరువులా..? కార్యాలయాలా..?

పార్వతీపురంలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడటంతో జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంతం వర్షపు నీటితో నిండి చెరువులను తలపించింది. ఈ కార్యాలయం నుంచి తిరంగా ర్యాలీ తలపెట్టడంతో ఇక్కడకి వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా అధికారులు అందరూ ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తున్నా నడిచే దారిని బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
Similar News
News August 14, 2025
BREAKING.. నల్లగొండ: పోక్సో నింధితుడికి ఉరి శిక్ష

నల్లగొండలో పోక్సో ఇన్ఛార్జి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు మహమ్మద్ ముక్రంకు ఉరి శిక్షతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్లడించారు.
News August 14, 2025
విశాఖ జిల్లాలో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మి.మీల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పద్మనాభం మండలంలో 51.4mm, అత్యల్పంగా ములగడలో 5.6mm వర్షపాతం నమోదయింది. పెందుర్తిలో 18.2, భీమునిపట్నంలో 14.2 మి.మీ వర్షపాతం కురిసింది. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
News August 14, 2025
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.