News September 15, 2025

మన విజయవాడలో అతిపెద్ద కన్సర్ట్ మారథాన్

image

విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు అతిపెద్ద కన్సర్ట్ మారథాన్ నిర్వహించనున్నట్లు టూరిజం శాఖ తెలిపింది. 11 రోజుల పాటు జరిగే నాన్‌స్టాప్ మ్యూజికల్ ప్రోగ్రామ్స్‌లో సంగీత దర్శకులు మణిశర్మ, RP పట్నాయక్, రామ్ మిరియాల, గాయకులు సునీత, గీతా మాధురి, కార్తీక్, సందీప్ నారాయణ్, అభిజిత్ నాయర్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ గ్రూప్ నిర్వహిస్తాయంది.

Similar News

News September 15, 2025

రుషికొండ: సముద్రంలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

image

రుషికొండ బీచ్‌లో ఆదివారం సాయంత్రం గల్లంతైన ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పీఎం పాలెం ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయి శ్యామ్ మరో ఇద్దరు బీచ్‌లో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. ఇద్దరిని పోలీస్ గార్డ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం సంజయ్, సాయి శ్యామ్ మృతదేహాలు లభ్యమయ్యాయి.

News September 15, 2025

అనకాపల్లి: కాక రేపుతున్న బల్క్ డ్రగ్ పార్క్

image

అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కాక రేపుతోంది. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే ఈ ఇండస్ట్రీని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలిపిన 13 మందిపై నిన్న కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో ఈ పార్క్‌ను తూ.గో జిల్లాలో ఏర్పాటు చేయాలని చూడగా అక్కడ అడ్డుకున్నారని మత్స్యకారులు అంటున్నారు. దీంతో మత్స్య సంపద నాశనం అవుతుందని, తమ ఉనికే దెబ్బతింటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

News September 15, 2025

PDPL: విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్

image

తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(TGNPDCL) పరిధిలోని తెలంగాణ విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం (TPDEA) ఉపాధ్యక్షుడిగా పెద్దపల్లి ADE/ SPM అడిచర్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం హనుమకొండలో జరిగిన కార్యవర్గం ఎన్నికల్లో నాలుగో సారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు సహచర ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.