News August 1, 2024

మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: నారా లోకేశ్

image

నేడు పింఛన్ల పంపిణీలో భాగంగా మడకశిరలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా CPI(M), ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించగా.. మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. కొందరు పోలీసుల తీరు ఇంకా మారలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు.

Similar News

News April 13, 2026

GNT: ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణకు మొత్తం 9 మంది మంత్రులు హాజరుకానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సుపరిపాలన అందించడం, ఆర్థికాభివృద్ధిలో నైపుణ్యాలు పెంపొందించడం, తదితర కీలక అంశాలపై నిపుణులు వారికి శిక్షణ ఇవ్వనున్నారు.

News April 13, 2026

ANUలో అవకతవకలపై విచారణ.. నివేదికపై సందిగ్ధం!

image

ఆచార్య నాగార్జున వర్సిటీలో గత పాలనలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిగినా స్పష్టత లేదు. ఇప్పుడు ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. నిధుల దుర్వినియోగం, నియామకాల్లో అక్రమాలు వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించినా నివేదిక బయటకు రాలేదు. వారం గడుస్తున్నా చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారి తీసింది. అదే వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News April 13, 2026

GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే!

image

సీఎం చంద్రబాబు నాయుడు నేడు సచివాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 10:50 గంటలకు ఆయన తన కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆర్టీజీఎస్ (RTGS) పనితీరుపై అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష ముగిసిన తర్వాత సాయంత్రం 5:50 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.