News March 2, 2025
మరింత ప్రయత్నిస్తే TDP ఖాతాలో చిత్తూరు జిల్లా: CM

గడిచిన ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు ఇంకాస్త గట్టిగా కృషి చేసి ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా TDP క్లీన్ స్వీప్ చేసి ఉండేదని CM చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. GDనెల్లూరులో 30ఏళ్ల తర్వాత పార్టీ విజయం సాధించిందని ఇందుకు కార్యకర్తలు, నేతల కృషే కారణం అన్నారు. వారు మరింత ధృఢంగా పని చేసి ఉంటే పుంగనూరు, తంబళ్లపల్లెలో కూడా విజయం సాధించే వారిమని CM పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలి: నిట్ డైరెక్టర్

సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలని నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి అన్నారు. సోమవారం ప్రపంచ సైన్స్ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని నిట్లో అక్సాసెబుల్ అనలిటికల్ టెక్నాలజీపై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సును ప్రారంభించిన సుబుధి మాట్లాడుతూ.. నాణ్యమైన పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా ఇంజినీరింగ్ విద్యార్థులు నిరంతరం పయనించాలన్నారు. సామజిక బాధ్యతగా ఆవిష్కరణలు చేయాలన్నారు.
News November 10, 2025
సంగారెడ్డి: దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. టెండర్లు పూర్తయిన రోడ్లకు వెంటనే పనులు ప్రారంభించిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News November 10, 2025
మేడ్చల్: ప్రజావాణిలో 109 ఫిర్యాదుల స్వీకరణ

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వెను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం శామీర్పేట్ పరిధి అంతాయిపల్లిలోని జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియతో కలిసి 109 దరఖాస్తులను స్వీకరించారు.


