News February 3, 2025

మరికల్: చిరుత సంచారం నిజమే..!

image

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై <<15345332>>చిరుత<<>> సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేశ్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.

Similar News

News November 8, 2025

మహానంది: కోడిపిల్లకు రెండు తలలు

image

ఒక కోడి 10 నుంచి 20 గుడ్లు పెడుతుంది. పొదిగే నుంచి పిల్లలను పెట్టే వరకు ఎన్ని పిల్లలకు జన్మనిస్తుందో అంచనా వేయలేం. కానీ మహానందిలోని అబ్బీపురంలో గురువయ్య ఇంట్లో ఓ కోడి పిల్లకు రెండు తలలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గురువారం జన్మించగా శుక్రవారం మృతి చెందిందన్నారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటివి జరుగుతాయని పశు వైద్యాధికారులు తెలిపారు.

News November 8, 2025

రామాపురం వద్ద కూలిన చప్టాను రూ.6.5 లక్షలతో మరమ్మతులు

image

రామాపురం వద్ద కూలిన చప్టాను రూ.6.5 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతులు చేయించామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.రెండు కోట్ల అంచనాలతో తయారుచేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామన్నారు. కొత్తపేట గ్రామంలో చప్టాను రూ.12 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతు చేయవచ్చన్నారు. శాశ్వత పరిష్కారానికి రూ.3.50 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు.

News November 8, 2025

యసీన్ పటేల్ ఊచకోత.. భారత్ ఓటమి

image

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. తొలుత కువైట్ 6 ఓవర్లలో 106-5 స్కోర్ చేసింది. ఆ జట్టులోని యసీన్ పటేల్ 14 బంతుల్లోనే 58 రన్స్(8 సిక్సర్లు,2 ఫోర్లు) చేశారు. చివరి ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 2 బాదారు. తర్వాత భారత్ 5.4 ఓవర్లలో 79 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 6 ఓవర్లు ఆడతాయి. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు మాత్రమే బ్యాటింగ్ చేస్తారు.