News May 2, 2024
మరికొద్ది సేపట్లో శ్రీకాకుళం జిల్లాకు పవన్ కళ్యాణ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు పాలకొండ నియోజకవర్గంలో ఒడమ జంక్షన్లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీగా జనసైనికులు రానున్నారు. ఇప్పటికే పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళం: ‘పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ రోజు ఒక మొక్క నాటాలి’

ఈ నెల 10వ తేదీన పాఠశాలల్లో మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహిస్తున్నందున ఆరోజు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం విద్యాసంస్థల ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణంతో పాటు వారి గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువ గట్లు, రోడ్లు పక్కన మొక్కలు నాటాలన్నారు.
News July 7, 2025
శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.
News July 7, 2025
శ్రీకాకుళం: సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో డీపీఆర్సీ వారు ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్లను DPO భారతి సౌజన్య సోమవారం పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ చేసి అమ్మకాలు జరపాలని తెలిపారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వలన అధిక పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.