News December 13, 2025

మరీ కాకతీయ సంగతేందీ..?

image

ఎందరినో మేధావులుగా చేసిన కాకతీయ యూనివర్సిటీపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న వర్సిటీ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదింది. KU కేంద్రంగా రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయి. BRS హయాంలో నిధులు రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియాకు రూ.వేయి కోట్లు విడుదల చేయగా, KUకి కూడా రూ.వేయి కోట్లు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై కామెంట్?

Similar News

News December 15, 2025

ధారూర్‌ మండలంలోని సర్పంచ్‌‌లు వీళ్లే..

image

ధారూర్‌ మండలంలోని ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
అల్లాపూర్-విజయలక్ష్మీ
తరిగొప్పుల-అంజిలయ్య
అంతారం-సువర్ణ
అల్లీపూర్-వీరేశం
చింతకుంట-చంద్రయ్య
కెరెల్లీ-పద్మమ్మ
కొండాపూర్ కుర్ద్-స్వాత

News December 15, 2025

మూడు దేశాల పర్యటనకు మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్‌’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.

News December 15, 2025

వంజరపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక.. ఇతనే సర్పంచ్ నా ఇక..?

image

వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో మోర్తల చందర్ రావు ఆరో వార్డు నుంచి గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో గిరిజనులు లేకపోవడం కారణంగా సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇదే పరిస్థితితో 1, 4, 5 వార్డుల్లోనూ ఎస్టీకి రిజర్వు కాగా నామినేషన్లు నమోదు కాలేదు. గ్రామంలో 2, 3, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో సర్పంచ్ ఇతనేనా..?