News April 2, 2024
మల్కాజిగిరిలో BRS జెండా పాతేనా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712055216563-normal-WIFI.webp)
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?
Similar News
News July 19, 2024
HYD: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721403325680-normal-WIFI.webp)
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెహికల్ ఓనర్తో పాటు తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల HYD శివారులోని శంకర్పల్లిలో బాలుడు (16) స్నేహితులతో కలిసి కారును వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు గుర్తు చేశారు. దీంతో కారు యజమాని, తండ్రిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. SHARE IT
News July 19, 2024
సికింద్రాబాద్ బోనాలకు రావాలని KCRకు ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721394018720-normal-WIFI.webp)
HYD ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు రావాలని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో KCRను సికింద్రాబాద్ MLA పద్మారావు గౌడ్, ఆయన కుమారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్ బోనాలకు వచ్చే కేసీఆర్, టక్కర్బస్తీలోని పద్మారావు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.
News July 19, 2024
HYD: అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721384126964-normal-WIFI.webp)
అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్నగర్లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్బిహేవ్ చేశాడని విచక్షణ రహితంగా దాడి చేయడంతో చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.