News February 11, 2025
మల్కాజిగిరి: మహిళల రక్షణే ధ్యేయం: డీసీపీ

మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీం పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్ హెచ్చరించారు. నెల రోజుల్లో 163 మంది పోకిరిలను సాక్యాధారాలతో సహా పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోఈవ్ టీజర్లకు క్యాంపు కార్యాలయంలో మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.
Similar News
News March 12, 2025
డా.N. యువరాజ్కు నెల్లూరు జిల్లా బాధ్యతలు

నెల్లూరు జిల్లా ప్రత్యేకాధికారిగా డా.N.యువరాజ్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.
News March 12, 2025
తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ ఐఏఎస్ అధికారిగా ప్రవీణ్ కుమార్ను తూ.గో.జిల్లా ఇన్ఛార్జ్గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్ఛార్జ్గా అజయ్ జైన్ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
News March 12, 2025
వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.