News May 8, 2024

మల్కాజిగిరి మినీ ఇండియా: రాగిడి లక్ష్మారెడ్డి

image

మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇదో మినీ ఇండియా అని, భిన్న ప్రాంతాల వారున్నారన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మెట్రో విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతానని తెలిపారు.

Similar News

News October 3, 2024

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం: సీపీ

image

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

News October 2, 2024

BREAKING: HYD: KTRపై PSలో ఫిర్యాదు

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTRపై HYD వనస్థలిపురం PSలో కాంగ్రెస్ నేత, TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాలనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ఈ ప్రణాళిక చేశారని ఇటీవల KTR ఆరోపించారు. సీఎంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన KTRపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News October 2, 2024

HYD: చిన్ననాటి స్నేహితుడే చంపేశాడు!

image

దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో సోమవారం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. భర్తతో విడిపోయిన స్పందన (29) అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటోంది. సోమవారం హత్యకు గురి కావడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చిన్ననాటి క్లాస్మేట్ బాలు హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలు భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఒప్పుకోకపోవడంతో దాడి చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు.