News October 14, 2024

మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌కు కొత్త రూపురేఖలు

image

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS)లో భాగంగా చేపట్టిన మల్కాజిగిరి రైల్వే స్టేషన్ పునరభివృద్ధి శరవేగంగా సాగుతోంది. వచ్చే ఆరు నెలల్లో పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. భారతీయ రైల్వే ద్వారా పునరుద్ధరణ, పునరాభివృద్ధి కోసం భారతదేశం అంతటా 1,275 స్టేషన్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. అందులో మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసి అభివృద్ధి పనులకు రూ.27 కోట్లు కేటాయించారు.

Similar News

News October 15, 2024

HYD: ఈ నెల 22న కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపు

image

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.

News October 14, 2024

HYD: రాడార్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR

image

ఓ వైపు మూసీ నదికి CM మరణశాసనం రాస్తూ.. మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో తమపై రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని, జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.

News October 14, 2024

HYD: విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల 

image

సికింద్రాబాద్‌లో <<14353764>>ముత్యాలమ్మ విగ్రహాన్ని<<>> ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.