News December 28, 2025
మల్కాజిగిరి: సదరం సర్టిఫికెట్లు పొందేందుకు తేదీలివే

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించిన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. జనవరి 6, 8, 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో ఈ శిబిరాలు ఉంటాయని గ్రామీణాభివద్ధి శాఖాధికారి సాంబశివరావు తెలిపారు. స్లాట్ రిసిప్టుతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయించుకున్న మెడికల్ సర్టిఫికెట్తో హాజరుకావాలని తెలిపారు.
Similar News
News January 2, 2026
సూర్యాపేట: రాజకీయ కక్షలతో వేధిస్తున్నారు: మత్స్యకారులు

మూడు దశాబ్దాలుగా చింతపాలెం మండలం పులిచింతల నదిని నమ్ముకుని జీవిస్తున్న తమను ఆంధ్రకు వెళ్లాలంటూ వేధిస్తున్నారని రేబల్లె మత్స్యకారులు కలెక్టరేట్లో మొరపెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొందరు కుట్రపూరితంగా తమ లైసెన్సులపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తమ పొట్ట కొట్టవద్దని, అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
News January 2, 2026
జీవీఎంసీ స్థాయి సంఘంలో 109 అంశాలకు ఆమోదం

జీవీఎంసీలో శుక్రవారం స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన 109 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధాన అజెండాలో 87 అంశాలు, 52 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 139 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి వివిధ కారణాలు వలన 30 అంశాలు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.26.46 కోట్ల అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.
News January 2, 2026
టెట్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: సూర్యాపేట ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు జరిగే టెట్ పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండొద్దని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.


