News February 20, 2025

మల్కాజిగిరి: 63 కిలోల ఎండు గంజాయి పట్టివేత

image

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి, ఆలేరు, మహబూబాబాద్, కాజీపేట ప్రాంతంలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 63 కిలోల గంజాయి పట్టుబడినట్లు రైల్వే బృందం తెలిపింది. దీని విలువ దాదాపుగా రూ.20.25లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. గత 3రోజులుగా రైళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న అధికారులు, గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నారు.  

Similar News

News September 18, 2025

పెద్దవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన

image

ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో పశువుల చికిత్సలకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం తాళ్లపూడి మండలం పెద్దేవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గేదెల వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

News September 18, 2025

‘కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను అప్పులపాలు చేసింది’

image

తెలంగాణను KCR కుటుంబం అప్పుల పాలు చేసిందని PCC ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మండిపడ్డారు. KNRలోని R&B గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో హరీశ్‌రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించగా, KCR సూత్రధారి అని హరీశ్‌రావు విచారణలో చెప్పారని అన్నారు. నయీం ఆస్తులను KCR తన ఖజానాలో జమచేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని గజ్జల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు.

News September 18, 2025

ఆనందపురం: కుక్క అడ్డురావడంతో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

image

ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాధపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎర్ర గౌరి నాయుడు(40) గురువారం మధ్యాహ్నం కుసులవాడ తీగలవానిపాలెం చెరువు దగ్గర కుక్క అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. తలకు తీవ్ర గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.