News April 15, 2025

మల్కాపురం: బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

image

మల్కాపురంలో ఓ యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి సాయి గణేశ్ (23) మల్కాపురం హరిజన వీధిలో ఉంటున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని వారం రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News January 29, 2026

నేడే కోపల్లె వంతెన నిర్మాణ పనులు ప్రారంభం: కలెక్టర్

image

కాళ్ల (M) కోపల్లె బ్రిడ్జికి సంబంధించిన పనులను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పాత బ్రిడ్జిని తొలగించి తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ రోడ్డులో లైట్ వెహికల్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హెవీ వెహికల్స్ నేషనల్ హైవే మీదుగానే వెళ్లాలని సూచించారు. ఇటీవల మంత్రులు ఈ రోడ్డుకు శంకుస్థాపన చేశారన్నారు.

News January 29, 2026

TU: B.ed మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షా షెడ్యూల్లో మార్పు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో B.ed మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షా తేదీలను రీషెడ్యూలు చేసినట్లు కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్ ఆచార్య సంపత్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ పరీక్షలు phase-1లో 7 కళాశాలలో ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు, Phase-2లో 8 కళాశాలలో ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు నిర్వహిస్తామన్నారు. B.ed కళాశాలల ప్రిన్సిపల్స్ ఈ నెల 29న సంబంధిత పత్రాలు సమర్పించాలని ఆదేశించారు.

News January 29, 2026

యాదాద్రి మున్సిపల్ బరిలో లోక్‌దళ్ పూర్తి పోటీ

image

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లో రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ పోటీ చేస్తుందని జిల్లా అధ్యక్షుడు బీరప్ప తెలిపారు. బుధవారం చౌటుప్పల్‌లో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ సాధికారతే లక్ష్యమని చెప్పారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.