News March 13, 2025
మల్దకల్: పట్టు వదలని విక్రమార్కుడు 4 ఉద్యోగాలు సాధించాడు

మల్దకల్ మం. ఎల్కూరుకి చెందిన నిరుపేద రైతు కూలి బిడ్డ మహమ్మద్ సుభాన్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ధరూర్ మం.లో 2014లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. 2024లో ప్రభుత్వ గురుకుల పాఠశాల టీచర్, జూనియర్ లెక్చరర్గా ఉద్యోగాలు సాధించాడు. 2023లో టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ల రాతపరీక్షలో ప్రతిభ చాటి ఫిజిక్స్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈ మేరకు నియామకపత్రాన్ని సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.
Similar News
News March 13, 2025
అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో బేబీ ఫీడింగ్ సెంటర్

అనకాపల్లి, పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో బాలింతలు పిల్లలకు పాలు ఇచ్చేందుకు బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి ప్రజా రవాణా అధికారి కె. పద్మావతి తెలిపారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఓ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో బేబీ ఫీడింగ్ సెంటర్ను బుధవారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలింతలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.
News March 13, 2025
పెద్దకొత్తపల్లి: గొంతులో అన్నం అడ్డొచ్చి శ్వాస ఆడక రైతు మృతి

అన్నం గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చంద్రకల్ గ్రామానికి చెందిన బండి గోవింద్ మద్యం తాగిన అనంతరం అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృతిచెందారు. మృతుడి కుమారుడు సిద్ధార్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకొత్తపల్లి ఎస్ఐ సతీశ్ తెలిపారు.
News March 13, 2025
HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.