News December 14, 2025

మల్దకల్: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

image

రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మల్దకల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం విజిట్ చేశారు. పోలింగ్ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భద్రత ఏర్పాట్ల గురించి పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. నిర్దేశించిన సమయంలో పోలింగ్ పూర్తి అయ్యే విధంగా పోలింగ్ వేగవంతం చేయాలని సూచించారు.

Similar News

News December 17, 2025

SRD: పోలింగ్ సరళి పరిశీలిస్తున్న ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలోని 8 మండలాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. పోలింగ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తునట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, రూట్ మొబైల్ బృందాల కదలికలను పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నామన్నారు.

News December 17, 2025

పంచాయతీ పోరు: పాన్‌గల్‌లో జోరు.. వీపనగండ్లలో నెమ్మది

image

వనపర్తి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా పాన్‌గల్‌ మండలంలో 56.7 శాతం పోలింగ్‌ నమోదు కాగా, వీపనగండ్లలో అత్యల్పంగా 52.4 శాతం నమోదైంది. పెబ్బేరు(55.6%), శ్రీరంగాపూర్(54.9%), చిన్నంబావి(54%)ల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు మండలాల్లోనూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.

News December 17, 2025

క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు.. లోకేశ్ సత్కారం

image

మహిళా ప్రపంచకప్‌లో సత్తాచాటిన కడప క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ నజరానా అందించింది. బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఆమెకు రూ.2.5 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీచరణి ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొనియాడారు.