News April 7, 2024

మల్యాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

image

మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన బొజ్జ లక్ష్మి (38) అనే మహిళ ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ గ్రామ శివారులోని వెంకటేశ్వర్ల గుట్టపై ఓ చెట్టుకు ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News September 10, 2025

KNR: RTC పంచారామాలు టూర్ ప్యాకేజీ వివరాలు

image

KNR- 2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో పంచారామాలు అనగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోట దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఈనెల 12న రా.10 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఈనెల 15న బస్సు KNR చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.3,300/-, పిల్లలకు రూ.2,500/- టికెట్ నిర్ణయించామన్నారు. వివరాలకు CALL 9398658062.

News September 10, 2025

KNR: ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ: కలెక్టర్

image

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు.

News September 9, 2025

KNR: SRR విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

image

కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సీపీగెట్) పరీక్ష ఫలితాల్లో SRR ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కామర్స్ విభాగంలో అక్కెం తిరుమలకు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు, జంగం నందిని 3వ ర్యాంకు సాధించారు. బాటనీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు పుట్టి అఖిల సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.