News February 22, 2026
మల్యాల: కాలువలో కారు బోల్తా.. BJP నేత మృతి

మల్యాల వరద <<19208074>>కాలువలో కారు బోల్తా<<>> పడిన ఘటనలో పెగడపల్లి(M) సుద్దపల్లికి చెందిన BJP నేత తిర్మని రమణ(53) మృతిచెందారు. ఈనెల 18న ఇంటి నుంచి కారులో వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో పెగడపల్లి PSలో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. MISSING కేసు నమోదైంది. కాగా మృతుడు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
HYD: ఇంట్లో చిరాకులు.. బయటే హాయిగా ఉంది!

‘మా వాళ్లతో మాట్లాడితే గొడవే అవుతుంది’.. ఇది యువత మాట. ఇంట్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం యువతను ఒంటరి చేస్తోంది. పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం, నిరంతరం విమర్శించడంతో ఇంటికి వెళ్లాలనే ఉత్సాహం చచ్చిపోతోంది. SMలో లోకాన్ని వెతుక్కుంటూ ఇంట్లో వాళ్లకు ముఖం చాటేస్తున్నారు. ఈ ‘అవాయిడెన్స్ కోపింగ్’ వల్ల యువత తమ ఇంటి కంటే బయటి ప్రపంచాన్నే, ఫ్రెండ్స్ గ్రూపులనే తమ అసలైన ఇల్లుగా ఫీలవుతున్నారట.
News February 25, 2026
HYD: ఇంట్లో చిరాకులు.. బయటే హాయిగా ఉంది!

‘మా వాళ్లతో మాట్లాడితే గొడవే అవుతుంది’.. ఇది యువత మాట. ఇంట్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం యువతను ఒంటరి చేస్తోంది. పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం, నిరంతరం విమర్శించడంతో ఇంటికి వెళ్లాలనే ఉత్సాహం చచ్చిపోతోంది. SMలో లోకాన్ని వెతుక్కుంటూ ఇంట్లో వాళ్లకు ముఖం చాటేస్తున్నారు. ఈ ‘అవాయిడెన్స్ కోపింగ్’ వల్ల యువత తమ ఇంటి కంటే బయటి ప్రపంచాన్నే, ఫ్రెండ్స్ గ్రూపులనే తమ అసలైన ఇల్లుగా ఫీలవుతున్నారట.
News February 25, 2026
విజయనగరం RDO, బొబ్బిలి DSP బదిలీ

2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఆర్డీవోలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారిని అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇవాళ కోర్టుకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. వారిలో విజయనగరం RDO దాట్ల కీర్తి కూడా ఉన్నారు. అదే విధంగా బొబ్బిలి DSP భవ్య రెడ్డిని కూడా బదిలీ చేశారు.


