News July 8, 2025

మల్యాల: ‘భార్య విడిగా ఉంటుందనే బాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం’

image

కొండగట్టులో గుడిసెల గట్టయ్య సోమవారం పెట్రోల్ పోసుకొని <<16984509>>ఆత్మహత్యాయత్నానికి <<>>పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతడు ఈ ఘాతుకానికి పాల్పడటానికి ప్రధాన కారణం తన భార్య కాపురానికి రాకుండా విడిగా ఉండటమే అని SI నరేష్ తెలిపారు. ఈ బాధతో మద్యానికి బానిసయిన అతడు సోమవారం ఉదయం విషం తాగాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స తీసుకోకుండానే కొండగట్టుకు వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. క్షతగాత్రుడిది మేడిపల్లి మం. కొండాపూర్.

Similar News

News July 8, 2025

AP NEWS ROUNDUP

image

* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా పరిధిలోనే అని CM చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
* విశాఖలో ఇన్నోవేషన్ క్యాంపస్‌ స్థాపనకు ANSR సంస్థతో ఒప్పందం కుదిరిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో 10 వేలమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
* YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డిపై MLA ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* ప్రపంచంలోనే AP లిక్కర్ స్కాం అతిపెద్ద కుంభకోణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

News July 8, 2025

జీరో కేలరీలు ఉండే షుగర్ మొక్క.. ఇంట్లోనే పెంచుకోవచ్చు!

image

షుగర్‌ కంటే దాదాపు 300రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉండే మొక్క ఒకటుంది. అదే ‘స్టీవియా రెబౌడియానా’. దీని ఆకుల నుంచి స్టీవియాను(స్వీట్నర్) తీస్తారు. ‘స్వీట్ లీఫ్’ అని పిలిచే వీటి ఆకులలో స్టీవియోసైడ్ & రెబౌడియోసైడ్ వంటి సమ్మేళనాలు అధిక తీపిని కలిగి ఉంటాయి. ఇందులో కేలరీలు ఉండవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. షుగర్ ఫ్రీ ఉత్పత్తుల్లో దీనిని వాడుతుంటారు. నర్సరీ/ఆన్‌లైన్‌లో లభించే వీటిని ఇళ్లలోనూ పెంచుకోవచ్చు.

News July 8, 2025

నరసరావుపేట: మొక్కలు నాటిన కలెక్టర్

image

నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామ రైతు రావి ఏడుకొండలు పొలంలో మామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ పి. అరుణ్ బాబు ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు పొలంలో పండ్ల తోటల పెంపకం చేపట్టినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాకు 600 ఎకరాలలో మొక్కలు పెంపకం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టి.వి కృష్ణ కుమారి, తహశీల్దారు పాల్గొన్నారు.