News January 9, 2026
మల్యాల: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి’

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనాన్ని అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మల్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. మెను ప్రకారం భోజనాన్ని అందించాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
Similar News
News January 11, 2026
సెంచరీ భాగస్వామ్యం.. ఫస్ట్ వికెట్ డౌన్

న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఎట్టకేలకు భారత బౌలర్ హర్షిత్ రాణా తొలి వికెట్ తీశారు. 62 పరుగులు చేసిన నికోల్స్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఓపెనర్లిద్దరూ అర్ధసెంచరీలతో తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. NZ స్కోరు 23 ఓవర్లలో 122/1. క్రీజులో కాన్వే(54), యంగ్(3) ఉన్నారు.
News January 11, 2026
మన ఊరు.. ఫస్ట్ విజువల్ ఏంటి..?

ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఊరిని వీడిన వారంతా పండగకు తిరిగి వచ్చేస్తున్నారుగా! సొంతూరు ఆలోచన రాగానే గుడి, చదివిన బడి, ఆడుకున్న చెట్టు, వీధి చివర షాపు, మన పొలం, ఊరి చెరువు.. ఇలా ఓ స్పెషల్ విజువల్ మన మైండ్లోకి వస్తుంది. ఎప్పుడు ఊరికొచ్చినా ఆ ప్లేస్కు వెళ్లడమో, దాని అప్డేట్ తెలుసుకోవడమో పక్కా. మన ఊర్లో మీకున్న ఆ ప్లేస్ ఏంటి? ఈ ఆర్టికల్ను మన ఊరి గ్రూప్స్లో షేర్ చేయండి, కామెంట్ చేయండి.
News January 11, 2026
‘హిజాబ్ పీఎం’ వ్యాఖ్యలు.. ఒవైసీ vs హిమంత!

హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<18819394>>వ్యాఖ్యలపై<<>> మాటల యుద్ధం జరుగుతోంది. ‘ఎవరైనా PM కావచ్చు. కానీ ఇది హిందూ దేశం. హిందూ వ్యక్తే PMగా ఉంటారని మేం నమ్ముతాం’ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. దీంతో హిమంత తలలో ట్యూబ్ లైట్ ఉందని ఒవైసీ ఎద్దేవా చేశారు. దేశం ఏ ఒక్క కమ్యూనిటీకి సొంతం కాదనే రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.


