News October 13, 2025
మల్యాల: సంతానం లేదనే బాధతో.. వ్యక్తి ఆత్మహత్య

మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన ఉప్పు శంకర్(43) శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఆరేళ్ల క్రితం వివాహమైనా పిల్లలు లేరనే బాధతో శంకర్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News October 13, 2025
NGKL: డీసీసీ అధ్యక్ష పదవికి కొండ మణెమ్మ దరఖాస్తు

నాగర్కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం మాజీ జడ్పీటీసీ కొండ మణెమ్మ ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామికి దరఖాస్తు పత్రాలను అందజేశారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ సీనియర్ నాయకులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి చివరికి ఎవరికి దక్కుతుందో చూడాలి.
News October 13, 2025
వనపర్తి డీసీసీ పదవికి పోటాపోటీ..!

వనపర్తి డీసీసీ పదవికి పోటాపోటీ నెలకొంది. ఈనెల 14న పార్టీ అబ్జర్వర్ వనపర్తికి వస్తున్న నేపథ్యంలోఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గాలు డీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, లక్కాకుల సతీష్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, తిరుపతయ్య పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
News October 13, 2025
KMR: 9 ఏళ్లు గడిచినా.. వసతుల విస్మరణ

కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత పాలన ప్రజలకు చేరువైంది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు కావడంతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. అయితే, జిల్లాల పునర్విభజన జరిగి 9 ఏళ్లు గడిచినా, కొత్తగా ఏర్పాటైన మండలాల్లోని అనేక ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. ఎంతో ఆశయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించినా, కనీస మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది.