News January 24, 2025

మల్లంపల్లి మండలాన్ని ప్రారంభించిన మంత్రులు

image

ములుగు జిల్లాలో నూతన మల్లంపల్లి మండలాన్ని రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి మల్లంపల్లి మండల ఏర్పాటు కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు అశోక్, గ్రంథాలయ ఛైర్మన్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 7, 2025

ముప్పాళ్ల: ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి

image

ముప్పాళ్ల (M) నార్నేపాడుకి చెందిన కొండారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కుటుంబంలోని చిన్నారి దీక్ష ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కింద పడి కన్ను మూసింది. తొలి ఏకాదశి పండుగ నాడు పొలానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నరసరావుపేటలోని పాఠశాలలో దీక్ష చదువుతోంది. గ్రామంలో గాయపడిన దీక్షను చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో మరణించింది. పాప మృతితో కటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News July 7, 2025

అన్నమయ్య: భార్య కాపురానికి రాలేదని సూసైడ్

image

అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలివీడు(M) మల్లసానివాళ్లపల్లెకు చెందిన తుపాకుల గోపాల్(37)కు పెద్దమండ్యానికి చెందిన రమణమ్మతో పదేళ్ల కిందట పెళ్లి జరగ్గా నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రమణమ్మ పుట్టింటికి వెళ్లింది. ఆమె కాపురానికి రావడం లేదని, తాను చనిపోతానని తల్లిదండ్రులకు గోపాల్ చెప్పాడు. తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు.

News July 7, 2025

ఆదిలాబాద్: కంట్లో కారం చల్లి, బండరాళ్లతో కొట్టి హత్య

image

లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో <<16964169>>మహిళ <<>>మృతదేహం ఆదివారం లభ్యమైన విషయం తెలిసిందే. ఇంద్రవెల్లి(M) నర్సాపూర్‌ వాసి వందన(45), ADB వాసి శంకర్‌‌ను పెళ్లిచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా చంపాలని భావించి ఈనెల 2న లక్ష్మిపూర్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. కంట్లో కారం చల్లి, తలపై బండరాళ్లతో కొట్టి హత్యచేశాడు. తండ్రిపై అనుమానంతో కూతురు PSలో ఫిర్యాదు చేయగా హత్య చేసినట్లు శంకర్ అంగీకరించాడు.