News April 24, 2024
మల్లన్నను దర్శించుకున్న నారా చంద్రబాబు దంపతులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా సోమవారం శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News April 21, 2025
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ ద్వారా 2,645 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-1057 ➤ BC-A:187 ➤ BC-B:259
➤ BC-C:27 ➤ BC-D:186 ➤ BC-E:99
➤ SC- గ్రేడ్1:35 ➤ SC-గ్రేడ్2:173
➤ SC-గ్రేడ్3:204 ➤ ST:161 ➤ EWS:257.
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16156783>>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
News April 21, 2025
DSC: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 పోస్టులు.. పోటీ వేలల్లో.!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ పోస్టులకు పోటీ నెలకొంది. జిల్లాకు 2,645 పోస్టులు మంజూరయ్యాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 30వేల మందికిపైగా అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఎస్జీటీ పోస్టులు రాష్ర్టంలోనే అధికంగా కర్నూలు జిల్లాలో 1,817 ఉండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News April 21, 2025
కర్నూలు: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

కర్నూలు జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితితంటూ ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు.