News December 20, 2025
మల్లన్న భక్తులకు ఊరట

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాల సమయం పెంచుతున్నట్లు ప్రకటించడం భక్తులకు ఊరటనిచ్చే విషయం. జనవరి నుంచి వీకెండ్స్లో 6 స్లాట్లలో భక్తులకు లింగాన్ని తాకి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని EO వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆది, సోమవారాల్లో 7am-8:30am, 11:45am-2pm, 9pm-11pm స్లాట్లలో స్పర్శ దర్శనం ఉంటుంది. HYD, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఫ్యామిలీస్ వీకెండ్లో ఎక్కువగా వెళ్తున్నారు.
Similar News
News December 24, 2025
ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్లో కీలక సమాచారం?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీటిని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్ కీలకం అవుతోంది.
News December 24, 2025
చరిత్రలో తొలిసారి.. వన్డేల్లో 574 పరుగులు

విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలనం నమోదైంది. వన్డే హిస్టరీలోనే తొలిసారి బిహార్ జట్టు 500 పరుగులు చేసింది. 45 ఓవర్లలోనే ఆ మైలురాయిని చేరుకుంది. మొత్తంగా 50 ఓవర్లలో 574/6 స్కోర్ చేసింది. వైభవ్ 190(84), ఆయుష్ 116(56), సకిబుల్ గని 128*(40B), పీయూష్ సింగ్ 77 ఆకాశమే హద్దుగా చెలరేగారు. గని 32 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. లిస్టు A క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.
News December 24, 2025
ఆలయాల్లో ‘వైకుంఠ ఏకాదశి’ ఏర్పాట్లు: TTD

AP: వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తుల రద్దీ దృష్ట్యా TTD అనుబంధ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలు సహా పలు జాగ్రత్తలు చేపడుతున్నారు. అమరావతి, VSP, HYD, బెంగళూరు, ఒంటిమిట్ట, నందలూరు, దేవుని కడప, జమ్మలమడుగు, తాళ్లపాక, పిఠాపురం, రాజంపేట తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD పేర్కొంది. 30న తెల్లవారుజాము 1.35 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలు ఆరంభం అవుతాయి.


