News January 15, 2026

మల్లూరు నరసింహుని సన్నిధిలో మంత్రి సీతక్క

image

సంక్రాంతి సందర్భంగా మంత్రి సీతక్క మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న వరపూజ మహోత్సవం విశేషాలను ఈవో మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Similar News

News February 4, 2026

VZM: ‘నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం’

image

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమని ఎస్పీ దామోదర్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు, ఇతర నేరాలు తగ్గుతాయని అన్నారు. నేరం జరిగినప్పుడు ఫుటేజీ ఆధారంగా కేసులు చేధించేందుకు అవకాశం ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన బుధవారం పిలుపునిచ్చారు.

News February 4, 2026

రమేశ్ మాదిగ హత్య కేసులో 12 మంది అరెస్ట్

image

MRPS రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రమేశ్ మాదిగ హత్య కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ఈ హత్యకు నిరసనగా, నిందితులను శిక్షించాలని దళిత సంఘాలు కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. ముమ్మర దర్యాప్తు అనంతరం ముద్దాయిలను పట్టుకున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.

News February 4, 2026

క్వారీ లీజ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

నవ్య రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో మైన్స్, రెవెన్యూ, అటవీ, పర్యావరణ శాఖల సమన్వయం కీలకమని NTR కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో క్వారీ లీజుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అవసరమైన NOCలను త్వరగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పనులకు అవసరమైన గ్రావెల్ కొరత రాకుండా చూడాలని సూచించారు.