News November 4, 2025

మళ్లీ నిర్మల్ జిల్లా డీసీసీ సిట్టింగ్ శ్రీహరిరావుకేనా?

image

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి మరోసారి సిట్టింగ్ అధ్యక్షుడు శ్రీహరి రావుకు దక్కుతుందని ఆయన వర్గీయులు బలంగా విశ్వసిస్తున్నారు. ఆయన కూడా మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తాను పార్టీలో జిల్లా పార్టీ బలోపేతం కోసం చురుకుగా పనిచేశానని అధిష్టానం దృష్టికి ఆయన వర్గీయులు తీసుకువెళ్లారు. ఒకవేళ మళ్లీ శ్రీహరిరావుకు ఇస్తే పార్టీ బలంగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

Similar News

News November 4, 2025

కూటమి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది: జగన్

image

కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రూ. 40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సింది పోయి, కేవలం రూ.5 వేలు ఇచ్చి రైతు వెన్ను విరిచారు అని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఉచిత ఇన్సూరెన్స్ ఉండేదని, ఇప్పుడు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనే పరిస్థితి వచ్చిందని, రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

News November 4, 2025

తిరుపతి: విధుల నుంచి ఇద్దరు టీచర్లు తొలగింపు

image

తిరుపతి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు 3 సంవత్సరాలుగా సమాచారం లేకుండా ఉద్యోగానికి రావడం లేదు. శ్రీకాళహస్తి మండలం ఓబులేలపల్లి ZP హైస్కూల్ వ్యాయమ ఉపాధ్యాయుడు ఏ.బాలకృష్ణ. రేణిగుంట మండలం గుండ్లకలువ MPPS SGT టీచర్ పి.దేవరాజును ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

News November 4, 2025

జిల్లాలో 64,160 పశువులకు వ్యాధినివారణ టీకాలు

image

జిల్లాలో 64160 పశువులకు గాలికుంటు వ్యాధినివారణ టీకాలు వేసినట్లు, దీంతో 14383 మంది రైతులు లబ్ధిపొందినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి కుమారస్వామి తెలిపారు. మంగళవారం పశువైద్యశాఖ డాక్టర్లు, సిబ్బందితో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 14 వరకు టీకాల కార్యక్రమం సాగుతుందని, జిల్లాలో 132285 పశువులు ఉన్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారి కోరారు.