News February 21, 2025
మసీదుల వద్ద సదుపాయాలు కల్పించాలని HNK కలెక్టర్కు వినతి

రానున్న రంజాన్ పండగ సందర్భంగా హనుమకొండ ప్రాంతంలో ఉన్న మసీద్ కేంద్రాల వద్ద ప్రభుత్వం నుంచి సదుపాయాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అజీజ్ మిర్జా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అజీజ్ మిర్జా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీద్ల వద్ద ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరినట్లు తెలిపారు.
Similar News
News November 3, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – కట్టడికి సూచనలు

ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కేజీల మందును.. 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.
News November 3, 2025
GNT: ఆన్లైన్ పెట్టుబడి మోసం.. ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ పెట్టుబడి మోసాల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన మడతల రమేష్రెడ్డి, విశాఖకు చెందిన గండి శ్రీను, విజయవాడకు చెందిన గుర్రపుకొండ శ్రీధర్ బాధితుల బ్యాంకు ఖాతాల ద్వారా కోట్ల రూపాయలు లావాదేవీ చేసినట్లు వెల్లడైంది. వీరు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో నకిలీ పెట్టుబడి పథకాలు నిర్వహించారు. పోలీసులు ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకొన్నారు.
News November 3, 2025
సంగారెడ్డి: రివాల్వర్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సందీప్ మహబూబ్సాగర్ చెరువు కట్టపై రివాల్వర్తో కాల్చుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కల్హేర్కు చెందిన సందీప్ ఏడాదికాలంగా పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.


