News March 4, 2025

మహబూబాబాద్: ‘అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు’

image

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక కంకరబోర్డు ఏరియాలో అర్ధరాత్రి సమయంలో దొంగలు, అపరిచితులు సంచరిస్తూ ఇంటి తలుపులు కొడుతున్నారని స్థానికులు తెలిపారు. దీంతో తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథి మాట్లాడుతూ.. భయాందోళనకు గురి కావొద్దని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

Similar News

News March 4, 2025

GWL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, ఆ పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని సూచించారు. 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడ రాదన్నారు.

News March 4, 2025

నల్గొండ: నీట్ పరీక్షకు కలెక్టర్ కసరత్తు

image

మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల, అలాగే మీర్‌బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

News March 4, 2025

బనకచర్లపై రాజకీయం చేస్తున్నారు: చంద్రబాబు

image

బనకచర్ల ప్రాజెక్టుకు TG ప్రభుత్వం అడ్డు <<15640378>>చెప్పడంపై<<>> AP CM చంద్రబాబు స్పందించారు. ‘గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తా అని చెప్పా. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే ఒక పార్టీ రాజకీయం చేస్తోంది. నాకు 2 ప్రాంతాలు సమానం.. రెండు కళ్లు అని చెప్పా. కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనెప్పుడూ అడ్డుచెప్పలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!